Somesh Kumar: బోగస్ ఇన్వాయిస్ ల సృష్టి సోమేశ్ కుమార్ కు సీఐడీ నోటీసులు

తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో సీఐడీ అధికారులు;

Update: 2024-09-14 08:50 GMT
SomeshKumar, GST, CIDNotice, former chief secretary Somesh Kumar comes under CID scanner, CID officials have issued notices to former state chief secretary Somesh Kumar in Telangana, telangana latest scam news updates

 Somesh Kumar

  • whatsapp icon

తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో సీఐడీ అధికారులు రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు. వస్తువులు సరఫరా చేయకపోయినా బోగస్ ఇన్వాయిస్ లను సృష్టించారని, సోమేశ్ కుమార్ తో పాటు మరో ముగ్గురు అధికారులకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. త్వరలోనే వీరి స్టేట్మెంట్లను రికార్డు చేయనున్నారు. ఈ కేసులో ఏ1గా వాణ్యిజ్య పన్నుల అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, ఏ2గా ఉప కమిషనర్ శివరామ్ ప్రసాద్, ఏ3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ4గా ప్లియంటో టెక్నాలజీస్ ఉన్నారు. సోమేశ్ కుమార్ ను ఏ5గా సీఐడీ పోలీసులు చేర్చారు

వాణిజ్య పన్నుల శాఖలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి కేసులు నమోదు చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ సహా ఆ శాఖ అధికారులను ప్రశ్నించే అవకాశం ఉంది. గతంలో హైదరాబాద్ క్రైమ్ సెంట్రల్ స్టేషన్ (సిసిఎస్) వాణిజ్య పన్నుల (జిఎస్‌టి) మోసానికి సంబంధించి 1,400 కోట్ల రూపాయల మేరకు కేసులు నమోదు చేసింది. అనంతరం కేసును సీఐడీకి బదిలీ చేశారు. GST మోసం బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ కేసుకు సంబంధించినది. ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించకుండానే 25.51 కోట్ల విలువైన ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను ఆమోదించింది.


Tags:    

Similar News