AP CM: కాకినాడకు ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కాకినాడలో

Update: 2024-09-11 05:38 GMT

ChandrababuNaidu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కాకినాడలో పర్యటించనున్నారు. ఏలేరు వరద ముంపు గ్రామం రాజుపాలెం గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టనున్నారు. ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులతో చంద్రబాబు మాట్లాడనున్నారు. సామర్లకోటలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఏలేరు ఆధునీకరణ, తీసుకోవలసిన చర్యలపై రివ్యూ చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ షెడ్యూల్:
సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం 11.10 హెలికాప్టర్ లో ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాల కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకుంటారు. 11.25 కు తమ్మిలేరు బ్రిడ్జికి చేరుకొని వరద పరిస్థితిని పరిశీలించనున్నారు.11:45 కు సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియం చేరుకుంటారు. అక్కడ రైతులు వరద బాధితులతో మాట్లాడతారు. అనంతరం మధ్యాహ్నం 12:30 కు సి ఆర్ రెడ్డి కళాశాల హెలిపాడ్ కు చేరుకొని హెలికాప్టర్లో సామర్లకోట వెళ్తారు.


Tags:    

Similar News