Palnadu : నేటి నుంచే పల్నాడు జిల్లాలో వ్యాపారాలు బంద్

పల్నాడు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలిస్ మల్లికా గార్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు

Update: 2024-06-02 06:29 GMT

పల్నాడు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలిస్ మల్లికా గార్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పల్నాడు జిల్లాలో నేటి నుంచి వ్యాపారాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. వ్యాపారులు తమకు సహకరించాలని మల్లికా గార్గ్ కోరారు.

ఐదో తేదీ సాయంత్రం వరకూ...
ఎగ్జిట్ పోల్స్ విడుదల కావడంతో పల్నాడు ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరికలతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి పల్నాడు జిల్లాలో ఐదో తేదీ సాయంత్రం వరకు వ్యాపారాలు బంద్ చేయాలని ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. జిల్లా అంతటా 144వ సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.


Tags:    

Similar News