జంపన్న వాగులో ఆర్టీసీ బస్సు బోల్తా.. తొమ్మిది మంది మృతి

జంపన్న వాగులో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.

Update: 2021-12-15 07:52 GMT

జంపన్న వాగులో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. జంగారెడ్డి గూడెం వద్ద ఉన్న జంపన్న వాగులో బస్సు బోల్తా పడింది. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారని తెలిసింది. అశ్వారావుపేట నుంచి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

స్థానికులు సాయంతో....
బస్సులో మొత్తం 47 మంది ప్రయాణికులున్నారు. వీరిలో తొమ్మిది మంది మరణించగా, అధికసంఖ్యు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికత్స అందిస్తున్నారు. బస్సు బోల్తా పడిన వెంటనే స్థానికులు బస్సులో నుంచి చాలా మంది ప్రయాణికులను బయటకు తీసుకు వచ్చారు.


Tags:    

Similar News