Tirumala : శనివారం... తిరుమలలో రష్ ఎంత ఉందో చూశారా?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ సాధారణంగా ఎకర్కువగానే ఉంటుంది.

Update: 2024-07-20 03:47 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ సాధారణంగా ఎక్కువగానే ఉంటుంది. శని, ఆదివారాలు భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారు. శనివారం స్వామి వారిని దర్శించుకుంటే మంచిదన్న భావన ఎక్కువ మంది ఉండటంతో శనివారం భక్తుల తాకిడి తిరుమలలో ఎక్కువగా ఉంటుంది. అందుకే శని, ఆదివారాలు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటారు. వసతి గృహాల కేటాయింపు నుంచి అన్న ప్రసాదాల వరకూ అనేక విషయాల్లో భక్తులు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నప్పటికీ భక్తులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అనేక సార్లు కనిపిస్తుంది. కానీ గత కొద్ది రోజుల నుంచి మామూలు రోజుల్లోనూ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది.

పద్దెనిమిది గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఐదు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం పదహారు నుంచి పద్దెనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 65,134 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,100
మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.27 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News