Tirumala : శనివారం.. తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ కొంత ఎక్కువగానే కనిపిస్తుంది.

Update: 2024-07-06 02:41 GMT

arjita seva tickets, devotees, online, tirumala

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ కొంత ఎక్కువగానే కనిపిస్తుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. శనివారం, ఆదివారం కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కొంత సమయం పడుతుండటంతో భక్తులకు అవసరమైన అన్న ప్రసాదాలను శ్రీవారి సేవకులు అందిస్తున్నారు. వసతి గృహాలు కూడా దొరకడం కష్టంగా మారింది. వసతి గృహాల కోసం భక్తులు అధిక సమయం వేచి చూస్తున్నారు.

పద్దెనిమిది కంపార్ట్‌మెంట్లలో...
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో నేడు పద్దెనిమిది కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 65,775 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,126 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.41 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News