Tirumala : కిటకిటలాడుతున్న తిరుమల... స్వామి వారి దర్శనానికి పద్దెనిమిది గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడతో భక్తుల సంఖ్య అధికంగానే ఉంది.

Update: 2024-07-21 03:05 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడతో భక్తుల సంఖ్య అధికంగానే ఉంది. స్వామి వారి దర్శనానికి అధిక సమయం పడుతుంది. క్యూ లైన్ లలో భక్తులు ఎక్కువ సేపు వేచి ఉంటున్నారు. వసతి గృహాల కోసం కూడా గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. సెలవుల సమయంలో సహజంగానే తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే ఉంటుంది. అందుకు తగిన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందుగానే చేశారు. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ముందుగానే ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు తిరుమలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. దీంతో పాటు పొరుగు రాష్ట్రమైన తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు.

31 కంపార్ట్‌మెంట్లలో....
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచిచూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూలైన్ లోకి ఈరోజు ఉదయం ఏడుగంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదహారు నుంచి పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 83,538 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,267 మంది భక్తుుల తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.25 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.


Tags:    

Similar News