Tirumala : భక్తవత్సలా గోవిందా... తిరుమలలో మళ్లీ రద్దీ పెరిగిందిగా?

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. గురువారం అయినప్పటికీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

Update: 2024-07-04 02:46 GMT

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. గురువారం అయినప్పటికీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గత రెండు రోజుల నుంచి కొంచెం భక్తుల సంఖ్య తగ్గింది. అయితే మళ్లీ గురువారం రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకునే సమయం కూడా ఎక్కువగా ఉంది. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకూ భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

హుండీ ఆదాయం...
ీఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్న భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదాలను శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 69,632 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,179 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.32 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News