Tirumala : ఆదివారం.. తిరుమల రద్దీ మామూలుగా లేదుగా

తిరుమలలో రద్దీ అధికంగానే ఉంది. ఆదివారం కావడంతో తిరుమలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

Update: 2024-07-07 03:45 GMT

తిరుమలలో రద్దీ అధికంగానే ఉంది. ఆదివారం కావడంతో తిరుమలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సహజంగా శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య అధికంగానే ఉంటుంది. మొక్కులు చెల్లించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో తిరుమలలోని వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. వసతి గృహాల కోసం కూడా భక్తులు వేచి ఉండక తప్పనసరి పరిస్థితి నెలకొంది. భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకంటున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.

24 కంపార్ట్‌మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఇరవై నాలుగు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్వనం పది నుంచి పన్నెండు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోని భక్తులకు శ్రీవారి సేవకులు అన్న ప్రసాదాలను అందచేస్తున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 77,995 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,250 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.72 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News