కేపీహెచ్ బీ లో ప్రేమజంట ఆత్మహత్య

ఇటీవల నగరానికి వచ్చిన జ్యోతి.. కేపీహెచ్ బీలోని ఓ ప్రైవేటు హాస్టల్ లో 20 రోజులుగా ఉంటోంది. శ్యామ్ కూడా ఇటీవల అదే..

Update: 2023-05-15 11:08 GMT

హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఫ్రెండ్ రూమ్ కి వెళ్లిన ప్రేమజంట.. అక్కడే బలవన్మరణాలకు పాల్పడ్డారు. మృతులు శ్యామ్ (24), జ్యోతి (22)లుగా గుర్తించారు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని గొల్లవానితిప్పకు చెందిన శ్యామ్, అదే గ్రామానికి చెందిన జ్యోతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఇటీవల నగరానికి వచ్చిన జ్యోతి.. కేపీహెచ్ బీలోని ఓ ప్రైవేటు హాస్టల్ లో 20 రోజులుగా ఉంటోంది. శ్యామ్ కూడా ఇటీవల అదే ప్రాంతంలోని తన స్నేహితుడు కృష్ణ వద్దకు వచ్చాడు. కృష్ణ ఊరికి వెళ్లడంతో శ్యామ్ రూమ్ తాళాలు అడిగి తీసుకున్నాడు. మూడు రోజుల క్రితం కృష్ణ రూమ్ కు శ్యామ్, జ్యోతి వచ్చారు. సోమవారానికి గది నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
పోలీసులు గదిని తెరిచి చూడగా.. శ్యామ్ ఉరికి వేలాడుతూ, జ్యోతి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కాగా.. యువతికి గతంలోనే మరో వ్యక్తితో వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబాలకు సమాచారమిచ్చి, మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు.


Tags:    

Similar News