భారీ ఎన్‌కౌంటర్‌.. 12 మంది మావోల మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

Update: 2024-07-18 04:42 GMT

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య నిన్న ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత లక్ష్మణ్ ఆత్రంతో సహా 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.

గాయాలపాలయిన...
ఈ ఎదురుకాల్పుల్లో ఎస్ఐతో పాటు ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే హెలికాప్టర్లలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని వండోలి గ్రామ సమీపంలో మావోయిస్టులున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు దాడులు నిర్వహించాయి. దీంతో ఎదురు కాల్పులు జరిగాయి.


Tags:    

Similar News