మరోసారి పోలీస్ కస్టడీకి శిల్పా చౌదరి

ప్రముఖలను మోసం చేసిన కేసులో శిల్పా చౌదరిని మరో మూడు రోజుల పాటు పోలీసులు ప్రశ్నించనున్నారు.

Update: 2021-12-09 13:36 GMT

ప్రముఖలను మోసం చేసిన కేసులో శిల్పా చౌదరిని మరో మూడు రోజుల పాటు పోలీసులు ప్రశ్నించనున్నారు. ఉప్పర్ పల్లి కోర్టు శిల్పా చౌదరిని మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. నార్సింగ్ పోలీసులు శిల్పా చౌదరితోపాటు ఆమె చెబుతున్న రాధికను కూడా విచారించనున్నారు.

ఇటీవల విచారణ చేసినా?

శిల్పా చౌదరి ప్రముఖలను మోసం చేసి దాదాపు వంద కోట్ల రూపాయలు ఎగ్గొట్టారన్న ఆరోపణలున్నాయి. బ్లాక్ మనీని వైట్ గా మారుస్తానని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడుల కోసమని శిల్పా చౌదరి సెలబ్రటీల నుంచి సొమ్ములు వసూలు చేశారు. అడిగినా ఇవ్వకపోవడంతో దాదాపు ఎనిమిది కేసులు శిల్పా చౌదరిపై నమోదయ్యాయి. ఇటీవల పోలీసులు రెండు రోజుల పాటు విచారించినా ఆమె నుంచి ఎలాంటి వివరాలు రాలేదు. బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేసినా అందులో పెద్దగా నగదు లేదు. దీంతో మరోసారి శిల్పా చౌదరిని పోలీసులు ప్రశ్నిస్తారు.




Tags:    

Similar News