Wanted: ఈ పోలికలు ఉన్న వ్యక్తి కనిపిస్తే వెంటనే పోలీసులను సంప్రదించండి

సామూహిక అత్యాచారం చేసి, ఆమె స్నేహితుడిపై దాడి చేసి

Update: 2024-10-05 08:51 GMT

crime news in pune

21 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె స్నేహితుడిపై దాడి చేసిన నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ఘటన మహారాష్ట్ర లోని పూణేలో చోటు చేసుకుంది. అయితే ఇద్దరు పరారీలో ఉన్న వ్యక్తుల స్కెచ్‌లను పూణే పోలీసులు విడుదల చేశారు. ఈ కేసులో నిందితుడిని తెల్లవారుజామున అరెస్టు చేశారు. అత్యాచార బాధితురాలు, ఆమె స్నేహితుడు ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం ముగ్గురు వ్యక్తులలో ఇద్దరికి సంబంధించిన స్కెచ్‌లను విడుదల చేశారు. రెండు స్కెచ్‌లు సిద్ధంమయ్యాయి, వాటిలో ఒకటి 90 శాతం ఖచ్చితమైనది, మరొకటి 70 శాతం ఖచ్చితమైనదని ఒక అధికారి మీడియాకు తెలిపారు.

పోలీసులు మూడు మొబైల్ ఫోన్ నంబర్‌లను కూడా అందించారు. ఆ స్కెచ్ లోని వ్యక్తులు మీకు కనిపించిన వెంటనే 8691999689, 8275200947, 9307545045 ఈ నెంబర్లకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. స్కెచ్‌ల ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం 14 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. బాధిత యువతి మహారాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పూణెలోని సాసూన్ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

పూణెలోని బోప్‌దేవ్ ఘాట్ ప్రాంతంలో మహిళ, ఆమె స్నేహితుడిపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు సామాజిక కార్యకర్తలా నటిస్తూ కారులో వారి వద్దకు వచ్చారు. ఆ ప్రాంతంలో జంటలు ఉండడానికి వీలు లేదని పేర్కొంటూ నిందితులు వీరిద్దరి ఫొటోలు తీశారు. నిందితుల్లో ఒకరు ఆ మహిళను బెదిరించి బలవంతంగా తన కారులోకి ఎక్కించుకున్నాడు. ఆమెను వేరే ప్రదేశానికి తీసుకెళ్లిన తర్వాత, వారు కారును ఆపి, మహిళ స్నేహితుడిపై దాడి చేసి చెట్టుకు కట్టేశారు. అనంతరం ముగ్గురు కలిసి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు.


Tags:    

Similar News