ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో ఉన్నది భారత రాజ్యాంగానికి సంబంధించిన అసలు కాపీ కానే కాదు
భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26, 2025న జరుపుకుంది. భారత ప్రజాస్వామ్యానికి పునాది అయిన భారత రాజ్యాంగం ఈ తేదీ;
![ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో ఉన్నది భారత రాజ్యాంగానికి సంబంధించిన అసలు కాపీ కానే కాదు Indian Constitution](https://www.telugupost.com/h-upload/2025/01/28/1500x900_1685263-constitution.webp)
Indian Constitution
భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26, 2025న జరుపుకుంది. భారత ప్రజాస్వామ్యానికి పునాది అయిన భారత రాజ్యాంగం ఈ తేదీనే అమలులోకి వచ్చింది. రాజ్యాంగాన్ని రచించి ఆమోదం పొందిన తరువాత అవసరాన్ని బట్టి దాన్ని సవరణ చేస్తుంటారు. ఇప్పటి వరకు భారత రాజ్యాంగంలో చాలా ముఖ్యమైన సవరణలు జరిగాయి. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పొడవైన లిఖిత రాజ్యాంగం. వాస్తవానికి ఇది 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్లు, 145,000 పదాలను కలిగి ఉంది. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పని చేసిందని తెలిస్తే ఆశ్చర్యపోకమానరు.
అయితే, లండన్ లైబ్రరీలో ఉన్నానని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి భారత రాజ్యాంగం కాపీని చూపిస్తూ తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో షేర్ అవుతోంది. అక్కడ ఉన్న ఒక పుస్తకం చూపిస్తూ భారతదేశం సిద్ధాంతపరమైన రాజ్యాంగమని, అందులో హిందూ దేవుళ్ళ చిత్రాలేవీ లేవని తెలిపారు. రాముడు, సీత, లక్ష్మణుడు, కృష్ణుడు వంటి వారి చిత్రాలు లేవనీ వాదించారు.
“बेहद अहम जानकारी बहुत बहुत साधुवाद! आपने ये वीडियो शेयर किया मेरी तरह अधिकतर बहुजन लोग इस दुष्प्रचार से भ्रमित थे। आज सच्चाई सामने आ ही गई।“ అంటూ హిందీలో ఈ పోస్టు వైరల్ అవుతూ ఉంది. “చాలా ముఖ్యమైన సమాచారం పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు! మీరు ఈ వీడియోను షేర్ చేసారు. నాలాగే బహుజనులు చాలా మంది ఈ ప్రచారంతో గందరగోళానికి గురయ్యారు. ఈరోజు నిజం బయటపడింది.'' అన్నది ఆ పోస్టుల అర్థం.
ఇదే వీడియో ని మరో సోషల్ మీడియా వినియోగదారుడు "मनुवादियों का यह दावा भी झूठा निकला. लो आज एक नई जानकारी सामने आई है कि मूल संविधान में किसी भी राम, कृष्ण, सीता की फोटो नहीं है ये लोग आज तक हमारे समाज को मूर्ख बना रहे थे। ये जानकारी वायरल होनी चाहिए जो आपके हाथ में है। అంటూషేర్ చేసారు. “ఈ మనువాదుల వాదన కూడా అబద్ధమని తేలింది. చూడండి, అసలు రాజ్యాంగంలో రాముడు, కృష్ణుడు, సీత ఫోటోలు లేవని ఈ రోజు ఒక కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. ఎంతో మంది మన సమాజాన్ని మోసం చేస్తూనే ఉన్నారు. మీ చేతిలో ఉన్న ఈ సమాచారం వైరల్ అవుతుంది." అన్నది వైరల్ పోస్టుల అర్థం