Sabarimala: శబరిమలకు వెళ్లాలని అనుకుంటున్నారా.. ఈ విషయం తెలుసుకోండి!!
శబరిమలకు తెలుగు రాష్ట్రాల నుండి భారీ ఎత్తున వెళుతూ ఉంటారు;

శబరిమలకు తెలుగు రాష్ట్రాల నుండి భారీ ఎత్తున వెళుతూ ఉంటారు. ఇక కార్తీక మాసం మొదలైందంటే అయ్యప్ప స్వాములు శబరిమలకు పోటెత్తుతారు. శబరిమలలో నవంబర్లో ప్రారంభమయ్యే రెండు నెలల మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర విషయంలో కేరళ అధికారులు కీలక ప్రకటన చేశారు. అయ్యప్ప స్వామి ఆలయంలో రోజుకు గరిష్టంగా 80,000 మంది భక్తులను అనుమతిస్తామని, ఈ ఏడాది భక్తులను ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే అనుమతిస్తామని కేరళ ప్రభుత్వం శనివారం తెలిపింది.
శబరిమలకు వెళ్లే భక్తుల్లో ఎక్కువ భాగం తెలుగు వాళ్ళే ఉంటారు. ప్రతీ ఏడాది కొత్త కొత్త సమస్యలను అయ్యప్ప స్వాములు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యలు ఉన్నాయి అని చెబుతున్నా కూడా సదుపాయాలను మెరుగుపరచడంలో కేరళ ప్రభుత్వం విఫలమవుతూ వస్తోంది. ఎన్నో ఏళ్లుగా శబరిమలకు వెళుతున్న అయ్యప్పలకు ఈ ఏడాది అయినా సరైన సదుపాయాలను అధికారులు కల్పించి ఉంటారో లేదో చూడాలి.