Telangana : నేడు తెలంగాణకు రాజ్‌నాథ్ సింగ్ రాక

ఈరోజు తెలంగాణకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రానున్నారు. వీఎల్‌ఎఫ్ స్టేషన్ ను ఆయన ప్రారంభించనున్నారు.

Update: 2024-10-15 01:44 GMT

rajnath singh

ఈరోజు తెలంగాణకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రానున్నారు. రంగారెడ్డి జిల్లా పూడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వీఎల్‌ఎఫ్ స్టేషన్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. దామగూడెం రిజర్వ్‌ ఫారెస్ట్ లో 1174హెక్టార్ల భూమిలో ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది.

రెండు పార్టీలూ...
డిసెంబరు 2017లో జీవో కూడా విడుదల చేసింది. ఇప్పుడు దానిని రాజ్‌నాధ్ సింగ్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా పాల్గొననున్నారు. అయితే దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటుపై పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వం జీవో జారీ చేసిందని కాంగ్రెస్, ఈ ప్రభుత్వమే రాడార్ వ్యవస్థను కాంగ్రెస్ ను కొని తెచ్చుకుంటుందని బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. ఈరోజు మాత్రం రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఈ రాడార్ స్టేషన్ ను ప్రారంభించనున్నారు.


Tags:    

Similar News