Rain Alert : ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. మూడు రోజులు బయటకు రాకపోవడమే మంచిదట

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2024-10-15 03:24 GMT

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తదుపరి రెండు రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు,దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతుంది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తృతంగా వర్షాలు కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు పలుచోట్ల అతితీవ్రభారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే చాన్స్ ఉంందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరుతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు...
ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటను ప్రభుత్వం నిషేధించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. ప్రస్తుతం నెల్లూరు నుంచి 750 మీటర్లు దూరం లో అల్పపీడనం వుంది.దీని ప్రభావం తో ప్రస్తుతం కృష్ణా, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి కాకినాడ పరిసర భాగాల్లో జల్లులు నమోదవుతున్నాయి.తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, వైస్సార్, అనంతపురం జిల్లాలో వర్షాలు అక్కడక్కడ నమోదవుతున్నాయి.ఈ వర్షాలు తెల్లవారుజామున సమయం విస్తారంగా కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, విజయవాడ, ఏలూరు, మచిలీపట్నం, దివిసీమ అవనిగడ్డ, నాగాయలంక, రేపల్లె, నిజాంపట్నం, ఒంగోలు, అద్దంకి, చీరాల, బీమవరం, నరసాపురం, తణుకు, రాజమండ్రి పరిసర భాగాల్లో వర్షాల జోరు ఉంటుందని పేర్కొంది.
ఈదురుగాలులతో కూడిన...
ఈ వర్షాలు మధ్యాహ్నం సమయం లో నిన్నటి కంటే ఈరోజు వర్షాల జోరు అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండం గా మారుతుంది, కాబట్టి రేపు, ఎల్లుండి ఈదురు గాలులు ఎక్కువ గా కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, విజయవాడ, ఏలూరు, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, తిరుపతి, చిత్తూరు జిల్లాలో గంటకి 50 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. రేపటి కంటే 17 తారీకున వర్షాలు విస్తరం గా వుంటాయని,ఈ వాయుగుండం 17 తారీకు నెల్లూరు సమీపంలో తీరాన్ని తాకుతుందని, కాబట్టి వర్షాల కు బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది. ఇప్పటికే కోస్తా ప్రాంతంలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఇరవై నాలుగు గంటలు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి నెల్లూరు ట్యాంకర్లను తెప్పిస్తున్నారు. ముందస్తు చర్యలు అన్ని తీసుకుంటున్నారు. ఈ తుఫాను దెబ్బకు నెల్లూరు ప్రాంతంలో కొంత ఇబ్బంది కరమైన పరిస్థితులు ఏర్పడతాయని అంచనాలు వేస్తున్నారు.
Tags:    

Similar News