మీరు ఓటర్‌ ఐడి కార్డుకు ఆధార్‌ లింక్‌ చేశారా? లేకుంటే ఇబ్బందులే..

ఆధార్‌ను అనుసంధానం చేసే పని అన్నింటికి వస్తోంది. ఇప్పటికే పాన్‌కార్డు, రేషన్‌ కార్డు ఇలా రకరకాల డాక్యుమెంట్లకు ఆధార్‌..

Update: 2023-08-17 06:58 GMT

ఆధార్‌ను అనుసంధానం చేసే పని అన్నింటికి వస్తోంది. ఇప్పటికే పాన్‌కార్డు, రేషన్‌ కార్డు ఇలా రకరకాల డాక్యుమెంట్లకు ఆధార్‌ లింక్‌ చేయడం తప్పనిసరైంది. పొరపాటున ప్రభుత్వం చెప్పిన వాటికి ఆధార్‌ కార్డును అనుసంధానం చేయకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని గుర్తించుకోండి. గడువులోపు ఆధార్‌ లింక్‌ చేసుకోవడం తప్పనిసరి అయిపోయింది. దేశంలో నిబంధనలు సైతం రోజురోజుకు కఠినంగా మారుతున్నాయి. మోసాలను అరికట్టేందుకు ఇలాంటి చర్యలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. అందుకే ఆధార్‌ కార్డును అనుసంధానించాల్సిన అవసరం ఉందని చెబుతోంది. ఇప్పుడు ఆధార్‌ అనుసంధానం చేయడం ఓటర్‌ ఐడి వంతు వచ్చేసింది. ఇప్పటికే ఈ విషయం కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. నకిలీ ఓట్లను అరికట్టడం, బోగస్‌ ఓటర్‌ ఐడీలను ఏరివేస్తూ పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఈక్రమంలోనే ఓటర్ల జాబితాలను ఆధార్‌ నంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియ గత ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభించింది ప్రభుత్వం. ఇక ఆధార్‌ కార్డు లేకున్నా మరో పది గుర్తింపు పొందిన ధ్రువీకరణ పత్రాలతో ఓటరుగా పేరును నమోదు చేసుకోవచ్చని కేంద్ర అధికారులు పేర్కొంటున్నారు.

వీటిలో.. గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు, ఫొటోతో కూడిన పోస్టాఫీస్‌/బ్యాంక్‌ పాస్‌బుక్‌ , ప్రభుత్వం జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, ఇండియన్‌ పాస్‌పోర్ట్‌, పెన్షన్‌ డాక్యుమెంట్‌ విత్‌ ఫొటోగ్రాఫ్‌, సర్వీస్‌ ఐడెంటిటీ కార్డు విత్‌ ఫొటోగ్రాఫ్‌, అఫీషియల్‌ ఐడెంటిటీ కార్డు, యూనిక్‌ ఐడెంటిటీ ఐడీ కార్డులతో ఓటరుగా పేరును నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

ఎన్నికల సంఘం పోర్టల్‌, ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఫోన్ ద్వారా ఆధార్ ఓటర్ ఐడీలను అనుసంధానం చేసుకునే వెసులుబాటు ఉంది. అలాగే గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల్లో కూడా ఈ ప్రక్రియను సైతం ప్రారంభించారు. మీ గ్రామంలో గ్రామ పంచాయతీకి వెళ్లి కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఇందు కోసం ఓ ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసి అనుసంధానం చేస్తున్నారు. ఎన్‌వీఎస్‌పీ పోర్టల్‌ ద్వారా: ఈ లింకింగ్‌ను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎన్నికల సంఘం పోర్టర్ ద్వారా కూడా చేయవచ్చు. ముందుగా రాష్ట్ర ఎన్నికల సంఘం పోర్టల్‌కు వెళ్లి పోర్టల్‌లో మీ ఓటర్ ఐడీ నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. మీ పేరు, పుట్టిన తేదీ మొదలైన ఇతర వివరాలను నమోదు చేయాలి. తరువాత మీ ఆధార్ నెంబర్‌ను నమోదు చేయాలి. దీంతో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేయడం ద్వారా ఓటర్‌ ఐడికి ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేసుకోవచ్చు.

SMS ద్వారా: ఇక మీ మొబైల్‌ నుంచి ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా లింక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. దీని కోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మెసేజ్ పంపాల్సి ఉంటుంది. ఈ మెసేజ్‌ను 166 లేదా 51969కి పంపాలి. ECLINK స్పేస్ EPIC నంబర్ స్పేస్ ఆధార్ నంబర్ నమోదు చేసి కూడా లింక్‌ చేయవచ్చు. ఫోన్‌ చేయడం ద్వారా: ఫోన్ ద్వారా ఆధార్ ఓటర్ ఐడి కార్డులను లింక్ చేయడానికి భారత ప్రభుత్వం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేక కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఓటర్లు 1950 నంబర్‌కు కాల్ చేసి కూడా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. అందులో చెప్పే వివరాలను నమోదు చేసి ఈ పని పూర్తి చేసుకోవచ్చు. మీ ఆధార్ ఓటర్ ఐడీ లింకింగ్ ప్రక్రియ పూర్తి అయ్యాక.. మొబైల్ ఫోన్‌లో దానికి సంబంధించిన మెసేజ్ వస్తుంది.

Tags:    

Similar News