SIM Card Rules: సిమ్ కార్డ్‌లపై మరో కొత్త నిబంధన.. జనవరి 1 నుంచి అమలు

టెలికాం మంత్రిత్వ శాఖ జనవరి 1, 2024 నుండి కొత్త మొబైల్ కనెక్షన్‌ను కొనుగోలు చేయడానికి నిబంధనలను మార్చింది..;

Update: 2023-12-06 03:37 GMT
Telecom ministry, New SIM Card, SIM Card, Telecom, KYC, SIM Card Rules
  • whatsapp icon

టెలికాం మంత్రిత్వ శాఖ జనవరి 1, 2024 నుండి కొత్త మొబైల్ కనెక్షన్‌ను కొనుగోలు చేయడానికి నిబంధనలను మార్చింది. దీంతో ఇప్పుడు కొత్త సిమ్‌కార్డు కొనుగోలు చేయడం వినియోగదారులకు మరింత సులువుగా మారింది. దేశంలో డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించేందుకు కొత్త సిమ్ కార్డును పొందేందుకు పేపర్ ఆధారిత కేవైసీపై పూర్తి నిషేధం విధించనున్నట్లు టెలికమ్యూనికేషన్స్ శాఖ (టెలికాం మంత్రిత్వ శాఖ) తెలియజేసింది. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు వినియోగదారులు కొత్త సిమ్ కార్డును పొందడానికి డిజిటల్ లేదా ఇ-కెవైసిని మాత్రమే సమర్పించాలి.

DoT నోటిఫికేషన్ జారీ (click the link)

కొత్త సంవత్సరం అంటే జనవరి 1, 2024 నుంచి SIM కార్డ్‌ల కొనుగోలు నిబంధనలలో పెద్ద మార్పులు చేయబోతున్నట్లు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ టెలికాం విభాగం మంగళవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఏ కస్టమర్ అయినా సిమ్ కార్డ్ పొందడానికి e-KYC చేయవలసి ఉంటుంది. అలాగే ఇప్పుడు పేపర్ ఆధారిత KYC పూర్తిగా నిలిపివేయబడుతుంది.

ఇది కాకుండా, కొత్త మొబైల్ కనెక్షన్ పొందడానికి మిగిలిన నియమాలు అలాగే ఉండబోతున్నాయని, దానిలో ఎటువంటి మార్పులు చేయలేదని కూడా తెలిపింది. ఇంతకుముందు సిమ్ కార్డ్ పొందడానికి, మీరు ఇ-కెవైసితో ​​పాటు పేపర్ బేస్డ్ కెవైసి ఉండేది. కానీ ఇప్పుడు అది జనవరి 1 నుండి పూర్తిగా నిలిపివేయబడుతుంది.

డిసెంబర్ 1, 2023 నుండి SIM కార్డ్ నియమాలలో మార్పులు:

దీనికి ముందు, టెలికాం మంత్రిత్వ శాఖ సిమ్ కార్డుకు సంబంధించిన మరో నిబంధనను మార్చింది. నిబంధనలను మార్చడం ద్వారా, డిసెంబర్ 1 నుండి ఒక ఐడిపై పరిమిత సంఖ్యలో సిమ్‌లను జారీ చేసే నిబంధనను కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. SIM కార్డ్ పొందడానికి ముందు, KYC ప్రక్రియను పూర్తి చేయడం అవసరం. ఒక వ్యక్తి ఒకేసారి బహుళ సిమ్ కార్డులను కొనుగోలు చేస్తే, అతను దానిని వాణిజ్య కనెక్షన్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయవచ్చు.

Tags:    

Similar News