Parliament : నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు

పార్లమెంటు సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి జులై 3వ తేదీ వరకూ పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి

Update: 2024-06-24 01:40 GMT

పార్లమెంటు సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి జులై 3వ తేదీ వరకూ పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మొదటి రోజు పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ తొలుత సభ్యుడిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు.

రెండు రోజుల పాటు...
అనంతరం సభ్యులందరి చేత వరసగా ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలి రోజు 280 మంది పార్లమెంటు సభ్యులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రెండో రోజు 264 మంది ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ సమావేశాల్లోనే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవి ఎంపిక ఉండనుంది. ఇందుకోసం అధికార ఎన్డీఏ పలు పేర్లను పరిశీలిస్తుంది.


Tags:    

Similar News