కొత్త బాధ్యతల్లో లక్ష్మీనారాయణ..!

Update: 2018-11-26 08:22 GMT

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇవాళ హైదరాబాద్ లో ఆయన అధికారికంగా లోక్ సత్తా పార్టీలో చేరారు. ఆ పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో పాటు లోక్ సత్తా పార్టీ అధ్యక్ష బాధ్యతలను కూడా లక్ష్మీనారాయణకు అప్పగించారు. వాస్తవానికి, లక్ష్మీనారాయణ ప్రత్యేకంగా పార్టీని స్థాపించాలని అనుకున్నారు. కానీ, తన సిద్ధాంతాలతోనే ఉన్న లోక్ సత్తా పార్టీలో చేరాలని ఆ పార్టీ నేతలు ఆహ్వానించారు. 2009కి ముందు జయప్రకాశ్ నారాయణ స్థాపించిన లోక్ సత్తా ఆ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్నిచోట్లా పోటీ చేసినా కూకట్ పల్లి స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. అయితే, ఓట్లు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలోనే సాధించింది. గత ఎన్నికల్లో జయప్రకాశ్ నారాయణ మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి పోటీచేసి ఓడిపోయారు. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీనారాయణ మళ్లీ పార్టీని యాక్టీవ్ చేయనున్నారు.

Similar News