Rk roja : పంతం నెగ్గించుకున్న రోజా

వైసీపీ నేత ఆర్కే రోజా తన మాటను నెగ్గించుకున్నారు. తన వర్గానికే ఎంపీపీ పదవిని దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో నిండ్ర ఎంపీపీ పదవికి రోజా [more]

Update: 2021-10-08 06:45 GMT

వైసీపీ నేత ఆర్కే రోజా తన మాటను నెగ్గించుకున్నారు. తన వర్గానికే ఎంపీపీ పదవిని దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో నిండ్ర ఎంపీపీ పదవికి రోజా పోటీ పెట్టారు. కానీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులు వేరే వారిని పోటీకి దింపారు. ఈ సందర్భంగా రోజాకు, వైరి వర్గం వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే ఈ విషయాన్ని రోజా తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి చేరవేశారు. వారి సూచన మేరకు ఈరోజు నిండ్ర ఎంపీపీగా రోజా వర్గానికి చెందిన దీపను వైసీపీ ఎంపీటీసీలందరూ కలసి ఎన్నుకున్నారు.

Tags:    

Similar News