ఏపీలో ఆర్టీసీ బస్సులు బంద్ ?

టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు శనివారం నంద్యాలలో అరెస్ట్ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా

Update: 2023-09-09 05:46 GMT

టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు శనివారం నంద్యాలలో అరెస్ట్ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సులను ఎక్కడికక్కడే నిలిపి వేశారు. టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో బస్సులకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి టీడీపీ శ్రేణులు. దీంతో అలర్ట్‌ అయిన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా టీడీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా.. ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. డిపోలు, బస్టాండ్‌లో బస్సులు నిలిచిపోయాయి.


Tags:    

Similar News