లోకేష్‌కు ఎమ్మెల్యే పిన్నెల్లి స‌వాల్‌

మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ సీనియ‌ర్ నేత‌ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చేశారు.

Update: 2023-08-08 05:47 GMT

మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ సీనియ‌ర్ నేత‌ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. లోకేష్ మగాడైతే.. నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలని నిప్పులు చెరిగారు. రూ. వెయ్యి కోట్ల అవినీతా.. నిరూపించు అని స‌వాల్ విసిరారు. లోకేష్‌.. నీవు చంద్రబాబు నాయుడికి నిజంగా పుట్టి ఉంటే నాపై ఆరోపణలు రుజువు చేయాలని తీవ్రంగా రియాక్ట‌య్యారు. నన్ను ఏదో చేయాలి అనుకున్న మీ అయ్య వల్లే కాలేదు.. నీ వల్ల ఏమౌతుంది..? అని ఎద్దేవా చేశారు.

లోకేష్ పప్పు కాదు.. వెర్రి పుష్పం అంటూ సెటైర్లు సంధించారు. లోకేష్.. నిన్ను త్వరలో ఎర్రగడ్డ పిచ్చి ఆస్పత్రిలో జాయిన్ చేస్తారని వ్యాఖ్యానించారు. పెద్దిరెడ్డి రాజకీయ అనుభవం అంత లేదు.. నీ జీవితం.. నీవా పెద్దిరెడ్డిని విమర్శించేది అంటూ లోకేష్‌పై ఫైర్ అయ్యారు. వార్డు నెంబర్‌గా కూడా గెలవలేని లోకేష్‌.. ఐపీఎస్‌ ఆఫీసర్లను విమర్శిస్తున్నాడ‌ని.. రిషాంత్ రెడ్డిని విమర్శించే స్థాయి లోకేష్‌ది కాద‌ని అన్నారు. రిషాంత్ రెడ్డి నీలాంటి చిల్లరోడు కాదన్నారు

అరాచకాలు, విధ్వంసాలు చేస్తుంటే లా అండ్ ఆర్డర్‌ కాపాడటం తప్పా..? అని ప్ర‌శ్నించారు. లోకేష్.. చిన్నా, పెద్దా గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో లోకేష్‌ను వార్డు మెంబర్‌గా కూడా గెలవనీయమ‌న్నారు. పల్నాడు జిల్లాలో ఏడుకు ఏడు నియోజకవర్గాలు గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. క్రిమినల్స్‌ను పక్కన పెట్టుకుని.. వారిచ్చిన స్క్రిప్ట్ లోకేష్ చదువుతున్నాడని అన్నారు.

మాచర్లలో లోకేష్ మాట్లాడుతూ.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నాలుగు సార్లు గెలిపించారు. ఇక్కడ అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్‌గా ఉందన్నారు. పిన్నెల్లి సోదరులను పిల్లి బ్రదర్స్ అని పిలుస్తూ ఎద్దేవా చేశారు. గ్రానైట్ లారీల నుంచి మామూళ్లు, పొరుగు రాష్ట్రాల మద్యం అమ్మకాలతో కోట్లు గడించారన్నారు. గుట్కా, మట్కా, పేకాట గ్యాగులను నడిపిస్తున్నారని లోకేష్ విమర్శలు గుప్పించారు.





Tags:    

Similar News